మునిస్వామి ఉరుసులో పాల్గొన్న ఎమ్మెల్యే కేయి శ్యాంబాబు

మునిస్వామి ఉరుసులో పాల్గొన్న ఎమ్మెల్యే కేయి శ్యాంబాబు

 గ్రామ ముఖం ద్వారాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేయి శ్యామ్ బాబు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల నల్లగుండ్ల గ్రామంలో వెలసిన హజారత్ సయ్యద్ మునీర్ భాష (మునిస్వామి) ఉరుసును గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. మునిస్వామి ఉరుసు మహోత్సవానికి పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం కుమార్ కు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.ఉరుసు మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు నల్లగుండ్ల గ్రామ టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి బాణాసంచా కాలుస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు.అనంతరం గ్రామంలోని గొర్ల గిడ్డయ్య కుమారుడు కూసినేని శేఖర్ తన మొక్కుబడిగా 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ ముఖ ద్వారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఖుషినేని రవి కుమార్,గిడ్డయ్య,తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు రాంపల్లి తిరుపాల్ నాయుడు,రాంపురం కొట్టాల వెంకట రాముడు చౌదరి, బొందిమడుగుల సర్పంచ్ సలహాదారులు ప్రతాప్ యాదవ్, నునుసరాళ్ళ రంగారెడ్డి,దేవదాస్ గౌడ్, సాగు నీటి సంఘం చైర్మన్ రామాంజి నేయులు,మారెళ్ల మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈడిగ వెంకటరాముడు, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్, మహేంద్ర,పెండెకల్ వీరభద్రప్ప,రాంపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, తెలుగు యువత మండల అధ్యక్షుడు సత్య ప్రకాష్,పలుగ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.అనంతరం కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు దాతలు నగదు బహుమతులను ప్రధానం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!