సమస్యలు సమన్వయంతో పరిష్కరించాలి

సమస్యలు సమన్వయంతో పరిష్కరించాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; కాలనీల్లో ఏర్పడే చిన్నపాటి సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిష్కారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వడ్డేగిరి, బుధవారపేట, ఏ.క్యాంపు, జోహరపురం ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, పలు కాలనీల్లో పలు సమస్య ప్రదేశాలను కమిషనర్ పరిశీలించారు. కొండారెడ్డి బురుజు వద్ద మ్యాన్‌హోల్‌పై వెంటనే మూత పెట్టించాలని, బుధవారపేట, ఏ.క్యాంపుల్లోని ప్యాకెట్ పార్కుల్లో అభివృద్ధి పనులు, జోహరపురం నందు మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఈఈ మనోహర్ రెడ్డి, ట్రైనీ ఏఈ రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!