
విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఐద్వా, డివైఎఫ్ఐ
ఆదోని, న్యూస్ వెలుగు; ఆదోని పట్టణంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో చదువుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్ ని కఠినంగా శిక్షించాలని ఐద్వా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఎన్ అలివేలు, వై నగేష్ సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే అమ్మాయిలపై చేతులు వేయడం తాకడం వికార చేష్టలకు పాల్పడుతున్న లెక్చరర్ ని వెంటనే డిస్మిస్ చేయాలి అలాగే అన్ని విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు అసభ్యంగా ప్రవర్తించే ఘటనలపై సమగ్రంగా విచారణ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు రోజుకు ఒకటి జరగడంతో విద్యార్థినీలను తల్లిదండ్రులు పాఠశాలలకు కళాశాలలకు పంపాలంటే భయపడే పరిస్థితి వస్తుందని దీని ద్వారా మహిళలు చదువుకి దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన చెందారు. మొన్న బనవాసి నేడు ఆదోని ఇలా బయటికి రాని ఘటనలు ఎన్ని ఉన్నాయో అర్థం కావడం లేదని కావున జిల్లా ప్రభుత్వ యంత్రాంగం రెగ్యులర్ గా మహిళ పాఠశాలలను, కళాశాలలను సందర్శించి లైంగికంగా వేధించే వారి వివరాలను విద్యార్థినీలు అధికారులకు పోలీసులకు నిర్భయంగా తెలియజేస్తే వాటిని రహస్యంగా ఉంచి వేధింపులకు పాల్పడే కీచకులపై కఠినంగా వ్యవహరించాలి మరో ఘటన జరక్కుండా ఉండాలి అంటే అధికార యంత్రాంగం వేగంగా స్పందించి శిక్షలు పడేలాగా చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు వెధవల వల్ల విద్యార్థినీలు చదువుకు దూరం కావాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయడం కాకుండా రెగ్యులర్గా విద్యార్థినీల దగ్గరకు వెళ్లి నిర్భయంగా వారి సమస్యలను తెలియజేసే వాతావరణన్ని సృష్టించాలని డిమాండ్ చేశారు.