
కర్నూలు జిల్లా కలెక్టర్ ఆప్టా డైరీ , కేలండర్ ఆవిష్కరణ
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) 2025 డైరీ , కేలండర్ జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాష చే ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఉపాద్యాయుల పాత్ర చాలా కీలకం అయినది. తల్లి తండ్రులు తరువాత గురువు లదే ఉన్నత స్థానం. తాను ఈ స్థాయి కి రావడం లో గురువుల ప్రోత్సాహం మరియు వారి ఆదరణ ఏంతో కీలకమైనవి అని అన్నారు.
ఈ కార్యక్రమము లో ఆఫ్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు, రాష్ట్ర నాయకులు పి రాజసాగర్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిమహమ్మద్ రఫీ , సీనియర్ నాయకుడు మహబూబ్ భాష పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!