
విద్యుత్ స్మార్ట్ మీటర్లు,వాటి ద్వారా చెల్లింపులు,సెక్యూరిటీ డిపాజిట్లు,ప్రవేటీకరణ విధానం ఉపసంహరించుకోవాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ కు,వినతి పత్రం ఇచ్చిన పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పాత మీటర్ల స్థానంలో కొత్త విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానంపై సవరణ డ్రాప్టు పై అభ్యంతరాలు తెలియజేస్తూ కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఏపీ ఇఆర్సీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ మరియు ఫైనాన్స్ మెంబర్ పివిఆర్ రెడ్డి గార్లకు పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1.1.2025 తేదీన గౌరవ కమిషన్ వారు జారీ చేసిన పబ్లిక్ నోటీస్ ప్రకారం అభ్యంతరాలు తెలిపాము. ఈ ప్రతినిధి బృందంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ, ఎండి యూనుస్, బి వన్నూరు సాహెబ్, జి శివ ప్రసాద్ చౌదరి, నాసిర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్లను తొలగించి.. కొత్త స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయడం వాటి ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు..సెక్యూరిటీ డిపాజిట్లు తదితర విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికే విద్యుత్ పంపిణీ కోసం ప్రభుత్వం అనుమతి పొందిన మూడు సంస్థలు ఏపీ ఎస్ పి ఎస్ సి ఎల్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ ఈ పీ డీ సీ ఎల్ ఉండగా మరో ప్రైవేటు సంస్థకు లైసెన్సులు ఇస్తున్నట్లు తెలిసిందని.. దీనివల్ల విద్యుత్ రంగాన్నే ప్రైవేటీకరించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఈ ఆర్ సి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ కోసం మరో కొత్త ప్రైవేటు సంస్థకు లైసెన్సు ఇవ్వడం లేదని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ఆలోచన కూడా లేదని హామీ ఇచ్చారు. ఏపీ ఈ ఆర్ సి సెక్రెటరీ మాట్లాడుతూ మీరిచ్చిన అభ్యంతరాలన్నీ రికార్డ్ చేస్తామని తెలిపారు.