
అభ్యుదయ కవితలు,కథలకు ఆహ్వానం — అరసం
కర్నూలు, న్యూస్ వెలుగు; అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అరసం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ,వల్లూరు శివప్రసాద్ ల పర్యవేక్షణలో కవితలు మరియు కథలతో కూడిన రెండు పుస్తకాలను ప్రచురిస్తున్నట్లు అరసం కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలం ప్రహ్లాద్, కొత్తపల్లి సత్యనారాయణలు పత్రికా ప్రకటనలో తెలియజేశారు .కనుక కర్నూలుజిల్లావాసులైన కవులు,రచయితలు అభ్యుదయ సామాజిక* నేపథ్యంతో కూడిన కవితలను కథలను రాసి పంపవలసినదిగా కోరారు. కథల విషయంలో మాత్రం ఇంతవరకు పుస్తక ప్రచురణకు నోచుకోని నూతన కథకులకు మాత్రమే అవకాశం
ఉంటుందని తెలిపారు. ఈ సదా అవకాశాన్ని కర్నూలు జిల్లా అభ్యుదయ కవులు రచయితలు సద్వినిగం
చేసుకోవాలని కర్నూలు జిల్లా కవులకు,రచయితలకు కోరారు.
వివరాలకు
జిల్లా అధ్యక్షుడు కలం ప్రహ్లాద్ సెల్ నంబర్ 9985355456 ను సంప్రదించాలని తెలిపారు.