
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని, కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశాల మేరకు, మంగళవారం స్థానిక ప్రభుత్వ టౌన్ మోడల్ కళాశాలలో విద్యార్ధులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత అంశం మీద వ్యాస రచన పోటీ, భారతదేశ ఎన్నికల మరియు ప్రజాస్వామ్యం నందు యువత పాత్ర అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ప్రతిభా కనబరిచిన విద్యార్థులు, ఈ నెల 23వ తేదీ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు ఉన్నతాధికారులచే విజేతలు బహుమతులు, ప్రశంస పత్రాలు అందుకోనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ డబ్లూ.ధనుంజయ, అధ్యాపకులు జావా గంగాధర్, జ్ఞానేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.- కర్నూలు నగరపాలక సంస్థ
Was this helpful?
Thanks for your feedback!