
92 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం
కూటమి ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి.
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శాంబాబు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని కడమకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలో 92 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టిన అభివృద్ధి పనులను పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు బుధవారం రోజున శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హుసేనాపురం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్యాంబాబుకు సర్పంచ్ మస్తాన్ బి మరియు సర్పంచ్ గౌరవ సలహాదారులు సుల్తాన్ పూలమాలలు వేసి సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా హుసేనాపురం గ్రామంలో 47 లక్షల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మరియు 45 లక్షల నిధులతో హుసేనాపురం నుండి ప్యాపిలి రోడ్డు వరకు నిర్మించిన సిమెంటు రోడ్డు ను పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల్లో మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన తెలియజేశారు. అనంతరం పగిడిరాయి గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ దేవర మహోత్సవ కార్యక్రమానికి పత్తికొండ శాసనసభ్యులు హాజరై,గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు,మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి, ఎస్.టి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటపతి,ఎర్రగుడి వెంకటస్వామి, మాజీ సర్పంచ్ పక్కిరప్ప,ఏకాంత్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు సంఘాల కృష్ణ తదితర మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.