బిజెపి జిల్లా అధ్యక్షుడి ను సన్మానించిన తుగ్గలి మండల కన్వీనర్ ఎద్దుల దొడ్డి లక్ష్మణ స్వామి నాయుడు

బిజెపి జిల్లా అధ్యక్షుడి ను సన్మానించిన తుగ్గలి మండల కన్వీనర్ ఎద్దుల దొడ్డి లక్ష్మణ స్వామి నాయుడు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి:  భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా అక్కమ్మతోట రామకృష్ణ ఎంపిక కావడం హర్షణీయమని తుగ్గలి మండల భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఎద్దుల దొడ్డి లక్ష్మణ స్వామి హర్షం వ్యక్తం చేశారు.అనంతరం కర్నూల్ జిల్లా బీజేపీ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన రామకృష్ణను పత్తికొండ బీజేపీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు సమక్షంలో తుగ్గలి మండల బీజేపీ అధ్యక్షులు ఎద్దులదొడ్డి లక్ష్మణ స్వామి నాయుడు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తుగ్గలి మండల బీజేపీ కన్వీనర్ ఎద్దులదొడ్డి లక్ష్మణ స్వామి నాయుడు మాట్లాడుతూ రామకృష్ణ పార్టీలో గత కొన్ని ఏళ్లుగా ఎన్నో సేవలు చేస్తూ అందరికీ సుపరిచితుడుగా ఉన్నాడని,రామకృష్ణ బీజేపీ పార్టీలో అనేక సేవా కార్యక్రమాలను నాటి నుండి నేటి వరకు చేస్తునే ఉన్నారన్నారని,రామకృష్ణ సేవలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకు కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో హర్షినీయమని తెలిపారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణను కలిసి అభినందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ బిజెపి కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు,
పత్తికొండ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండి మల్లికార్జున,జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!