పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

     నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు

నగరపాలక సంస్థ, కర్నూలు న్యూస్ వెలుగు; నగరంలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సాధించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన చిదంబరావు వీధి, కృష్ణానగర్, కొత్తపేట, ఎన్ఆర్ పేట, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని, మెరుగైన పారిశుద్ధ్యం అందించేందుకు ఏర్పడే ఆటంకాలను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. మురుగు కాలువల్లో మురుగునీటి పారుదల సక్రమంగా ప్రవహించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పలు ప్రాంతాల్లో నూతన మురుగు కాలువలను, అదేవిధంగా మరమ్మత్తులు అవసరమైన ప్రదేశాలను కమిషనర్ పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఈఈ శ్రీనివాస్ రెడ్డి, పారిశుద్ధ్య తనిఖీదారుడు లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!