ఫీల్డ్ అసిస్టెంట్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ఫీల్డ్ అసిస్టెంట్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

    కుటుంబానికి 30 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆలూరు మండలం అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ను హత్య చేసిన కఠినంగా శిక్షించాలని కుటుంబానికి 30 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు డిమాండ్ చేశారు. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేష్ గౌడ్ అధ్యక్షతన స్థానిక కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు . ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను హత్య చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ లను బెదిరించడం బలవంతంగా రాజీనామాలు చేయించడం జరిగిందని నేడు ఏకంగా హత్యలు చేసే వరకు వెళ్లారని విమర్శించారు ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు కూటమి ప్రభుత్వ నాయకులే బాధ్యత వహించాలని కోరారు ఈరన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు బలవంతంగా రాజీనామాలు చేయించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఇటువంటి చౌకబారు చర్యలకు స్వస్తి పలకాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నాయకత్వంలో ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు ప్రభుత్వం మారినప్పుడల్లా చిరు ఉద్యోగులు మారాలనే ఆలోచన నుండి కూటమి ప్రభుత్వ నాయకులు బయటకు రావాలని లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు .ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ జిల్లా నాయకులు బొజ్జ ప్ప, దేవేంద్ర ,వీర రాజు ,వీరన్న ,సురేంద్ర, మునిస్వామి, అభి బ్ ,హనుమంతు, కృష్ణ కుమార్ ,మెహబూబ్ ,మహదేవ్ రామాంజనేయులు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!