
దేశ భవిష్యత్తు యువతదే
హోళగుంద, న్యూస్ వెలుగు: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంటుందని తహసిల్దార్ నిజాముద్దీన్ పేర్కొన్నారు.శనివారం స్థానిక
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి,ప్రతిజ్ఞ విధి చేపట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్,విఆర్ఓలు నాగరాజ్,మల్లేష్,గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు.
*ఉత్తమ బిఎల్ఓ అవార్డు అందుకున్న తలారి రాఘవేంద్ర.
15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య చేతుల మీదుగా గెజ్జెహళ్లి గ్రామ సేవకుడు తలారి రాఘవేంద్ర ఉత్తమ బిఎల్ఓ గా అవార్డు అందుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!