
హత్య రాజకీయాలను తెదేపా ప్రోత్సహించదు
గౌడ్ కుటుంబం హత్య రాజకీయాలు చేసే కుటుంబం కాదు…
నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు బురద చల్లటం మంచిది కాదు….
అరికెర ఫీల్డ్ అసిస్టెంట్ ఘటన బాధాకరం…
హోళగుంద, న్యూస్ వెలుగు; తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని,శవ రాజకీయాలు చేసే ఆలోచన ఇన్చార్జి వీరభద్ర గౌడ్ కు లేదని,హత్య రాజకీయలు చేసే కుటుంబం వారిది కాదని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కొనసాగారని నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆరాట పడటమే గాని నాటి నుంచి నేటి వరకు ఏ రోజు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదని,ఆయనపై ప్రతిపక్షాలు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మండల తెదేపా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలూరు మండలం అరికేర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురువ అంగడి ఈరన్న హత్య చాలా బాధాకరమైన విషయమని ఇందుకు పార్టీ తరఫున తాము కూడా ఆవేదనను వ్యక్తపరుస్తున్నామన్నారు. అయితే ఇందులో ప్రతిపక్షాలు నిజనిర్ధారణ చేయకుండానే ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పై లేనిపోని అవాస్తవాలను చెప్పడం తప్పని అన్నారు. ఇన్చార్జి వీరభద్ర గౌడ్ కుటుంబం గత 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలోనే వారి తండ్రి ముద్దు బసవనగౌడ్ మరియు తన సోదరుడు కీర్తిశేషులు కుమార్ గౌడ్, నుండి వీరభద్ర గౌడ్ ఆ తర్వాత తన కుమారుడు గిరి మల్లేష్ గౌడ్ కానీ అలాంటివారు కాదని, ఇప్పుడే కాదు భవిష్యత్తులో సైతం వారు వారి కుటుంబ సభ్యులు ఇలాంటి శవ రాజకీయాలను ప్రోత్సహించరని తెలిపారు. అలాంటి వారి కుటుంబం పై నిందలు మోపడం సరికాదని,పార్టీ ఇంచార్జి గా వారి వద్దకు నియోజకవర్గ ప్రజలు వారి కష్టసుఖాలు చెప్పుకోవడానికి వారి వద్దకు వెళతారని ఎవరో హత్యలు చేస్తే వారి మీద నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. అరికేర ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్న హత్యను రాజకీయం చేయొద్దని, నిజనిజాలు తెలుసుకోవటానికి పోలీసులు, చట్టం, న్యాయ స్థానం ,ఉందని ఏ విచారణకైనా వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పై కొంతమంది కావాలనే అపోహలు ప్రచారం చేస్తున్నారని, వారు దాటుకుని పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, గతంలో తమకు పార్టీ అధిష్టానం సీటు కేటాయించకపోయిన పార్టీలోనే ఉండి పార్టీకి వెన్నుదన్నులా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎలాంటి పార్టీ మారకుండా పనిచేసిన ఘనత ఇన్చార్జి వీరభద్ర గౌడ్ అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి ఉంచి, ఆలూరు నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మురళీధరాచారి,అబ్దుల్ సుభాన్, డి ఎస్ భాషా, , తుంబళం గాదిలింగ,కురువ గాదిలింగ, సిబిఎన్ ఆర్మీ మోయిన్, శాలి మాభాష, ఎస్ఎంసి చైర్మన్ ద్వారకానాథ చారి, విజయ్ కుమార్, జంగాల రామాంజనేయులు, జాకీర్,చిన్నహ్యాట సర్పంచ్ హేసన్, జుమ్మా సలీం, కురువ మల్లికార్జున, హచోలి హుస్సేన్ పీరా,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.