
మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
మహానుభావుల త్యాగాలను మరువకూడదు
హొళగుంద, న్యూస్ వెలుగు: స్వాతంత్ర్య సాధనలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను మరువకూడదని,వాని స్ఫూర్తిగా తీసుకుని
నేటి సమాజం ముందుకు సాగాలని తహసీల్దార్ నిజాముద్దీన్,సర్పంచ్ చలువాది రంగమ్మ,ఎంపిపి నూర్జహాన్ బీ,ఈఓపిఆర్డి చక్రవర్తి,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు.ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆయా ప్రభుత్వ కార్యాలయంలో,పాఠశాలలో,ప్రేవేటు పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యము వచ్చింది.మన భారత దేశానికి రాజ్యాంగం రూపొందించడానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాగా, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్గా రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేశారు.1947 ఆగస్టు 29న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఛైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది.భారత రాజ్యాంగం రూపొందించడానికి రాత్రి పగలు ఎంతో శ్రమించి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంలో భారత రాజ్యాంగాని రూపొందించారని తెలిపారు.మరియు అనేక మార్పు చేర్పుల అనంతరం 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.అంతేకాకుండా భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల,11 నెలల,18 రోజుల కాలం పట్టిందన్నారు.భారత రాజ్యాంగం ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడిందని చెప్పారు.అలా రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశం సర్వసతాత్మక, సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో పరిణామ దశ పూర్తయిందన్నారు.అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ అంబెడ్కర్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు.మరియు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,ప్రవేటు కార్యాలయాలు,పాఠశాలలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి తనయుడు ఈసా,వైస్ ఎంపిపి భర్త హనుమప్ప,సర్పంచ్ తనయుడు పంపాపతి, కూటమి పార్టీ నాయకులు పంపాపతీ,ఎర్రి స్వామి,వెంకటేష్,అశోక, వీరేష్,వైసిపి నాయకులు షేక్షవలి,మల్లయ్య,పోలీస్ సిబ్బంది,రెవిన్యూ సిబ్బంది, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.