ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం

ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం

సిపి జిల్లా అధ్యక్షులు ఎస్ వి. మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ కలిసిన వైసిపి ఐటీ వింగ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి

కర్నూలు, న్యూస్ వెలుగు; మండల కేంద్రమైన తుగ్గలికి చెందిన మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి మనవుడు వైఎస్ఆర్సిపి ఐటి విభాగం అధ్యక్షులు తుగ్గలి చంద్రశేఖర్ సోమవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి కు ఇటీవల వైఎస్ఆర్సిపి ఐటి వింగ్ అధ్యక్షులుగా వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి స్థానిక మండల వైసీపీ నాయకులు తో కలిసి వైసిపి జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ లను కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధికారం లో లేకపోయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ముందుండాలని తమకు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలియజేశారని, అందువల్ల టిడిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్ఆర్సిపి తరఫున పోరాటాలు చేసినందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!