తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో బాదితురాలికి ప‌రిహారం అందించిన మంత్రి టి.జి భ‌ర‌త్

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో బాదితురాలికి ప‌రిహారం అందించిన మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు, న్యూస్ వెలుగు; వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ సంద‌ర్భంగా తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ బాధితుల‌కు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ ప‌రిహారం అంద‌జేశారు. క‌ర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన బోయ వెంక‌ట‌ల‌క్ష్మికి క‌ర్నూలు న‌గ‌రంలోని మంత్రి కార్యాల‌యంలో రూ.2 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. టిటిడి బోర్డు స‌భ్యులు మ‌ల్లెల రాజ‌శేఖ‌ర్, ఆలూరు టిడిపి ఇంచార్జి వీర‌భ‌ద్ర గౌడ్‌తో క‌లిసి బాధితురాలికి చెక్కు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం చేయించాల‌ని బాధితురాలు అడ‌గ్గా.. అందుకు త‌గిన‌ ఏర్పాట్లు చేస్తామ‌ని ఆమెకు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!