రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అమలు పై హర్షం వ్యక్తం చేసిన  ఐటిడిపి నాయకులు

రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అమలు పై హర్షం వ్యక్తం చేసిన  ఐటిడిపి నాయకులు

    రాంకొండ హెచ్ నాగరాజు….

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఐటి శాఖా, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ 2024 సంవత్సరంలో నాడు యువగళం పాదయాత్రలో బాగంగ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన హామీలలో ఒకటైన బటన్ నొక్కితే అన్ని సర్టిఫికెట్లు, బిల్లులు చెల్లింపులు జరిగే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ని అందుబాటులోకి తీసుకువస్తామని ఇచ్చిన మాట ప్రకారం గానే చెప్పిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ఐటి శాఖ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పై పత్తికొండ సోషల్ మీడియా ఐ టీడీపీ యువ నాయకులు రాంకొండ హెచ్. నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పత్తికొండ నియోజకవర్గపు శాసన సభా సభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు
తుగ్గలి మండల రాంకొండ హెచ్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన ఆరు మాసాలు దాటినా తర్వాత రాష్ట్ర ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను అన్ని ప్రభుత్వ బిల్లుల సేవలను ప్రజల యొక్క చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ లో వాట్సాప్ గవర్నెన్స్ ను అమలు చేస్తామని నాడు యువగళం పాద యాత్రలో ఐటి శాఖా విద్యా శాఖ మంత్రి తెలియజేయడం తో పాటు అమలులోకి తీసుకురావడంతో పాటు మొదటి విడతలో దాదాపు 150సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, రెండో విడతలో దాదాపు 350 సేవలను కేవలం వాట్సాప్ గవర్నెన్స్ లో అందివ్వబోతున్నందుకి గర్వించదగ్గ విషయమని అందుకు మన పత్తికొండ నియోజకవర్గపు ప్రజలు పౌర సేవలను, ఆరోగ్య శాఖా సేవలను, రెవిన్యూ శాఖా సేవలను,పోలీస్ శాఖా సేవలను,పిర్యాదు సేవలను, దేవదాయ సేవలను,ఎపిఎస్ ఆర్టీసీ సేవలను తదితర మొదలైన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ నియోజకవర్గం ఐటీడీపి నాయకులు రాంకొండ హెచ్. నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు మోహన్. చెన్న కేశవులు. అనీత్.శేఖర్. అనిల్. విజేయుడు. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!