సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల లో డ్రగ్ అబ్యూస్, సైబర్ నేరాలు, అంశాలపై అవగాహనా సదస్సు

సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల లో డ్రగ్ అబ్యూస్, సైబర్ నేరాలు, అంశాలపై అవగాహనా సదస్సు

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ శాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల, ఆత్మకూరు రోడ్డు, కర్నూలు నందు మత్తు పదార్థాల వినియోగం – వాటి అనర్థాలు, మహిళలపై లైంగిక వేధింపులు, మహిళలు & బాలికల అక్రమ రవాణా, ఈవ్ టీసింగ్, సైబర్ క్రైమ్ అనే అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడమైనది. .
ఈ సందర్బంగా సుధీర్ బాబు ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ప్రొహిబిషన్ & ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం, మహిళలపై లైంగిక వేధింపులు, సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువయ్యాయని ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎక్కువ బలి అవుతున్నారని యువత అప్రమథంగా ఉండాలని కోరారు . APSP DSP మహబూబ్ బాషా, మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఆదిలక్ష్మి గారు, సీఈఓ సెట్కూరు శ్రీమతి దీప్తి మొదలగు బాలికలు, మహిళలు సోషల్ మీడియా లో తమ ఫోటోలు అప్లోడ్ చేయకూడదని, వాటి వల్ల మహిళల ఫోటోల మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయని, బహుమతులు, స్పెషల్ ఆఫర్లు అంటూ మొబైల్ ద్వారా వచ్చే ఎటువంటి లింక్లను క్లిక్ చేయవద్దని, ఈ మధ్య కాలంలో మొత్తం సమాచారాన్ని సేకరించి వేధించడం ఎక్కువగా జరుగుచున్నదని మాట్లాడుతూ బాలికలు, మహిళలు విపత్కర పరిస్థితులలో భయపడకుండా ధైర్యంగా తిరుగబడాలని, సైబర్ నేరాలు, డ్రగ్ వలన అనర్తలు మొదలగు వాటిపై విపులంగా వివరించారు. మహిళలపై వేధింపులు సైబర్ క్రైమ్ నేరాలు మీ దృష్టికి వచ్చిన లేదా మీకు జరిగినఫుడు ప్రభుత్వం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన 181, 1098, 1930, 100 మొదలగు టోల్ ఫ్రీ నంబర్లు ద్వారా వెంటనే సంప్రదిస్తే తక్షణ చర్యలు తీసుకొనబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా!! విజయ సూరి , NSS ప్రోగ్రాం అధికారిణిలు శ్రావణి, విజయ మరియు ఇతర అధ్యాపకులు మరియు దాదాపు 350 మంది విద్యార్థులు, సెట్కూరు సూపరింటెండెంట్ శ్యాంబాబు, శ్రీనివాస సింగ్ మొదలగు పాల్గొన్నారు పి. దీప్తి
ముఖ్య కార్యనిర్వాహనాధికారి
సెట్కూరు, కర్నూలు.

Author

Was this helpful?

Thanks for your feedback!