
రైల్వే బడ్జెట్ లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి కొత్త రైల్వే లైన్లు, రైళ్లు వేయాలి. సిపిఎం డిమాండ్ శుక్రవారం నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా సాధారణ బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ లో కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కొత్త రైళ్ల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ముందు కర్నూలు జిల్లాకు రైల్వే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ పాలకులు మారుతున్నారు తప్ప కర్నూలు జిల్లా భవిష్యత్తు మారడం లేదని కర్నూలు జిల్లా నుండి రాజధానికి వెళ్లాలంటే కనీసం ఒక ట్రైన్ కూడా లేకపోవడం కర్నూలు నగర ప్రజల దౌర్భాగ్యం అని ఆయన విమర్శించారు. ఈ జిల్లా నుండి ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు ఏ ఒక్కరు కూడా ఈ జిల్లాలో ఒక ప్రధానమైన నగరాలకు కలుపుతూ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం కోసం నామమాత్రపు కృషి కూడా చేయలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. రైల్వే వేగన్ వర్క్ షాప్ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తామన్న నాటి ప్రభుత్వం యొక్క వాగ్దానాలు నేటికీ నెరవేరలేదని, 10 సంవత్సరాలు గడిచిన ఎక్కడ వేచిన గొంగళి అక్కడే ఉందని దానికోసం నిధులు కేటాయించడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ ను త్వరగా పూర్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు కర్నూలు నుండి హైదరాబాద్కు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని కోరుతూ సిపిఎం మరియు ఇతర పార్టీలు పెద్ద ఎత్తున సంవత్సరాల తరబడి పోరాటం చేయడం ఫలితంగా ఇంటర్సిటీ వచ్చిందని కానీ రాష్ట్రం విడిపోవడంతో మళ్లీ కర్నూల్ నగర ప్రజలకు రాజధాని కి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు తప్ప వేరే మార్గం లేని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దీని గురించి కనీసం ఆలోచన కూడా చేసే ఓపిక వాళ్లకు లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వాళ్లను గెలిపించడం ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. గతంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ మరియు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కర్నూల్ నుండి నడిచే రైళ్లను ఎందుకు ఆపారు రైల్వే అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూల్ నుండి ఓర్వకల్ మీదగా నంద్యాలకు కొత్త రైల్వే లైన్ ఇస్తానన్న ప్రభుత్వ వాగ్దానం నేటికీ అమలు నోచుకోలేదని ఎందుకు పనులు ప్రారంభించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. కనీసం ఈ బడ్జెట్ లోనైనా కర్నూలు జిల్లా నుండి రైలు నడపడం కోసం కొత్త రైల్వే లైన్లో వేయడం కోసం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపీలు మంత్రులు, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. కర్నూల్ నుండి విజయవాడకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని, కాచిగూడ టు గుంటూరు ఎక్స్ప్రెస్ విజయవాడ వరకు పొడిగించాలని, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ మరియు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ను తిరిగి ప్రారంభించాలని, కర్నూల్ టు నంద్యాల ఓరకల్ మీదుగా ఉన్న రైల్వే లైన్ పనులు త్వరగా ప్రారంభించాలని, మంత్రాలయం నుండి శ్రీశైలం కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని, కర్నూల్ నుండి బాంబే కు వెళ్లడానికి కొత్త ట్రైన్ వేయాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు దీని కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని అలా కేటాయించేలాగా స్థానిక ప్రభుత్వాలు ఎంపీలు, మంత్రులు, అధికారులు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ అంజిబాబు మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో నైనా కర్నూలు జిల్లా రైల్వే అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సాయిబాబా సుధాకరప్ప నర్సింలు విజయ్ రామకృష్ణ షరీఫ్ అబ్దుల్లా రాఘవేంద్ర నగేష్ ఆ రత్నమ్మ ప్రభాకర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు