
వేగవంతంగా పారిశుధ్య పనులు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం కాలనీల్లో వేగవంతంగా పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జాతర ఉత్సవాల సందర్భంగా కాలనీల్లో ఎక్కడ కూడా అపరిశుభ్రం లేకుండా సిబ్బందితో వేగవంతంగా పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ చల్లడం జరిగిందన్నారు.మరియు ప్రజలు కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు పంపాపతి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda