
త్రేవేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన ప్రధాని
ఉత్తరప్రదేశ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. సోషల్ మీడియా పోస్ట్లో, శ్రీ మోదీ మాట్లాడుతూ, సంగమంలో జరిగే స్నానం దైవిక అనుబంధానికి ఒక క్షణం అని అన్నారు. ఇందులో పాల్గొన్న కోట్లాది మంది ఇతరుల మాదిరిగానే, తాను కూడా భక్తి స్ఫూర్తితో నిండిపోయానని ఆయన అన్నారు. గంగా మాత దేశ ప్రజలకు శాంతి, జ్ఞానం, మంచి ఆరోగ్యం మరియు సామరస్యాన్ని దీవిస్తుందని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
“ ప్రధానమంత్రి మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి త్రివేణి సంగమం చేరుకోవడానికి పడవ ప్రయాణం చేశారు. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమ స్థలమైన త్రివేణి సంగమంలో శ్రీ మోదీ హారతి మరియు పూజలు చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు సంరక్షించడానికి ప్రభుత్వం నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి నిరంతరం యాత్రా స్థలాలలో మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను పెంచడానికి చురుకైన చర్యలు తీసుకున్నారు. అంతకుముందు, గత సంవత్సరం డిసెంబర్లో ప్రయాగ్రాజ్ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ ఐదు వేల 500 కోట్ల రూపాయల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, ఇది సాధారణ ప్రజలకు కనెక్టివిటీ, సౌకర్యాలు మరియు సేవలను మెరుగుపరిచింది. జనవరి 13న పౌష్ పూర్ణిమ నాడు ప్రారంభమైన మహాకుంభ్ 2025, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సమావేశం, ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. ఇది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు 39 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.