
పగడ్బందీగా భూ రీసర్వే పనులు
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరియు మద్దికేర తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్ ఆదేశాల మేరకు పెరవలి గ్రామం నందు పకడ్బందీగా భూ రీసర్వే పనులను నిర్వహిస్తున్నట్లు పెరవలి గ్రామ విఆర్ఓ బాలవర్ధరాజు తెలియజేశారు.బుధవారం రోజున పెరవలి గ్రామం నందు రేగడి పొలాలలో భూ యజమానులైన రైతుల ఆధ్వర్యంలో భూ రీసర్వేలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రోజుకు 20 ఎకరాలు చొప్పున భూ రీసర్వే పనులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ భూ రీసర్వే పనులకు రైతులందరూ రెవెన్యూ అధికారులకు సహకరించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విలేజ్ సర్వేయర్ సురేష్,తలారి నారాయణ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!