కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో పరిసరాలను   పరిశుభ్రత పాటిoచాలి 

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో పరిసరాలను   పరిశుభ్రత పాటిoచాలి 

కర్నూలు, న్యూస్ వెలుగు;  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గ్రాండ్ రౌండ్స్ భాగంగా శుక్రవారం  పలు ఒపి విభాగాలైన, మెడికల్, ఆర్థో, చిన్న పిల్లల ఒపి, గైనిక్, సూపర్ స్పెషాలిటీ ఒపి, మరియు ఎం సి హెచ్, గైనిక్, డైట్, పెయిన్ బ్లాక్, తదితర విభాగాలకు రౌండ్స్ నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో వాటర్ లీకేజ్ మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని హెల్త్ ఇన్స్పెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.ఆసుపత్రి ఆవరణలో ఉన్న వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా చూసుకోవాలని సెక్యూరిటీకి ఆదేశించారు.
ఫార్మసీ డిపార్ట్మెంట్ లో రౌండ్స్ నిర్వహించి ఫార్మసీ మాడ్యూల్ లోని ఈ హాస్పిటల్ అప్లోడింగ్ ప్రాసెస్ ను పకడ్బందీగా అమలు చేయాలని ఫార్మసీ సిబ్బందికి ఆదేశించారు.డైట్ విభాగానికి:-పేషెంట్లకు ఇస్తున్న భోజనాన్ని పరిశీలించారు, పేషంట్లకు సంబంధించిన మెను గురించి ఆరా తీశారు అనంతరం పేషెంట్లకు రుచికరమైన భోజనం అందించాలని డైట్ సిబ్బందికి ఆదేశించారు.గైనిక్ విభాగం దగ్గర ఉన్న వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు.ఆసుపత్రిలోని పెయిన్ బ్లాక్ లో ఉన్న డిలాక్స రూమ్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయని అన్నారు.ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రమణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, న్యూ డయాగ్నస్టిక్ మెడికల్ ఆఫీసర్, డా.సునీల్ ప్రశాంత్, ఆసుపత్రి ఏడి, మల్లీశ్వరి, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రి బాయి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS