
చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
రగ్బీ ఉమెన్స్ లీగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రూ.2 లక్షల నగదు బహుమతులను అందచేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు: విద్యార్థులు చిన్న తనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
మినిస్ట్రీ యూత్ అఫైర్స్,
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన
అస్మిత (Achieving Sports Milestone by Inspiring Women through Action) రగ్బీ ఉమెన్స్ లీగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం,మానసిక ఉల్లాసం తో పాటు క్రమశిక్షణ అలవడడం, ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాల వంటి సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు..కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు క్రీడాభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.. ఉమ్మడి నంద్యాల ఆర్జీఎం కళాశాల లో జరిగినపోటీల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేటు, కేజీబీవీ, ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల జట్లు పోటీపడ్డాయని, ఇందులో పోటీ పడి
కంబాలపాడు, దిన్నెదేవరపాడు, లక్ష్మాపురం, ఆళ్లగడ్డ ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినులు రూ.2 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నారని కలెక్టర్ వారిని అభినందించి నగదు బహుమతులను విద్యార్థినులకు అందచేశారు..
అనంతరం గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ డా.శ్రీదేవి, డిఎస్డిఓ భూపతిరావు, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.