ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు మానవతా కోణంలో ఆలోచించి భద్రతా చర్యలు తీసుకోవాలి

ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు మానవతా కోణంలో ఆలోచించి భద్రతా చర్యలు తీసుకోవాలి

జాతీయ రహదారులపై యాక్సిడెంట్ స్పాట్ లలో నిబంధనల ప్రకారం కచ్చితంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు న్యూస్ వెలుగు;

ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు మానవతా కోణంలో ఆలోచించి సమన్వయంతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా నేషనల్ హై వే, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
నేషనల్ హైవే ల్లో నిబంధనల ప్రకారం సైన్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్స్ తదితర చర్యలు తీసుకున్నారా లేదా అన్ని జాతీయ రహదారులపై సంబంధిత శాఖల అధికారుల టీమ్ తో వెళ్లి పరిశీలించాలని కలెక్టర్ ఆర్ అండ్ బి ఎస్ ఈ ని ఆదేశించారు..వారం, పది రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..నిబంధనల ప్రకారం చర్యలు లేకుంటే, వాటిని ఏర్పాటు చేసేలా నేషనల్ హైవే ఉన్నతాధికారుల దృష్టికి ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు.. ఇప్పటి వరకు నేషనల్ హైవే ల పై 37 బ్లాక్ స్పాట్లలో ఏర్పాటుచేసిన సైన్ బోర్డులు రంబుల్స్ ట్రిప్స్ స్పీడ్ బ్రేకర్లు తదితర చర్యలకు సంబంధించిన ఫోటోలను పంపించాలని కలెక్టర్ ఆదేశించారు..నేషనల్ హైవే రహదారుల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్న విధంగా ఆర్ అండ్ బి రోడ్లసి జరిగే ఆక్సిడెంట్ స్పాట్ ప్రదేశాల్లో కూడా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..కోడుమూరు రోడ్ లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటి నివారణకు ఏమి చేయగలమో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ అండ్ బి ఎస్ ఈ ని ఆదేశించారు .ప్రతి నెలా సమావేశానికి వచ్చే ముందు రహదారుల భద్రత కు సంబంధించి మరమ్మత్తులు ఎక్కడ చేయాలి, మన పరిధిలో చేయగలిగినవి ఏవి, ఏ పనులు చేపట్టాలి అన్న పూర్తి వివరాలతో, సరైన అంచనా నివేదికలతో రావాలని కలెక్టర్ ఆర్ అండ్ ఎస్ ఈ ని ఆదేశించారు..

యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా జరుగుతున్నాయని, ర్యాష్ డ్రైవింగ్ తదితర అంశాలపై వీడియో లు రూపొందించి కళాశాలల్లో విద్యార్థులకు ప్రదర్శించి చూపాలని కలెక్టర్ డిటీసీ ని ఆదేశించారు. యువతకు అవగాహన కల్పించే విధంగా విరివిగా అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయాలన్నారు.. హిట్ అండ్ రన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. గ్రామాల నుండి హైవే కి కనెక్ట్ అయ్యే అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్ లు, గ్రిల్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు..

ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర అప్రోచ్ రోడ్డు కు సంబంధించి త్వరితగతిన భూసేకరణ ను పూర్తి చేయాలని కలెక్టర్ ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్హెచ్ కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించి 6.5 ఎకరాల భూ సేకరణ కి ఎంత ఖర్చు అవుతుందో నివేదిక సమర్పించాలని కలెక్టర్ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు..ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.. సూరత్ హైవే రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని కలెక్టర్ సంబంధిత ఎన్ హెచ్ పిడి ని అడిగి తెలుసుకున్నారు..

బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఫ్రీ లెఫ్ట్, బస్ స్టాండ్ నుండి బెంగళూర్ రోడ్ కు వెళ్ళ వాహనాల కోసం ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.. ఇందుకు సంబంధించి త్వరితగతిన అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ప్రభుత్వ సర్వజన వైద్యశాల బయట ట్రాఫిక్ రద్దీ తగ్గించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ను ఆదేశించారు.. రాజ్ విహార్ వద్ద శాటిలైట్ బస్ స్టాండ్ ఏర్పాటు కు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్టీసీ ఆర్ ఎం ను ఆదేశించారు.. నేషనల్ హైవే ల పై సిటీ స్టార్టింగ్ ప్లేస్ నుండి సీ సీ కెమెరా లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గ్రామాల నుండి హైవే కి కనెక్ట్ అయ్యే అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్ లు తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు..ఎక్కడ ఏర్పాటు చేయాలో వివరాలు ఇస్తామని ఎస్పీ నేషనల్ హైవే అధికారులకు తెలిపారు.. నేషనల్ హై వే ల పై కొన్ని బ్లింకర్ లు లేవని, డార్క్ గా ఉందని, మల్టీ కలర్ బ్లింకర్ లు ఏర్పాటు చేయాలని, అదే విధంగా రేడియం, జిగ్ జాగ్ లను ఏర్పాటు చేయాలని ఎస్పీ నేషనల్ హై వే అధికారులను ఆదేశించారు.

నేషనల్ హైవే లలో రోడ్ సైడ్ వాహనాలు ఆపడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ పోలీసులతో పాటు నేషనల్ హైవే పెట్రోలింగ్ వాహనాల ద్వారా కూడా రోడ్ సైడ్ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ నేషనల్ హైవే అధికారులకు సూచించారు..సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, డిటిసి శాంతకుమారి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏవో సింధు సుబ్రమణ్యం, నేషనల్ హైవే పిడి లు, తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!