
ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
మార్లమడికి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని మార్లమడికి గ్రామంలో ఏఓ ఆనంద్ లోకదళ్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా మొక్క జొన్న పంట పొలాలన్నీ సందర్శించి పంటలో పురుగుల నివారణకు రైతులకు పలు సూచనలు ఇచ్చారు.అలాగే ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు ఐడీ సంఖ్యను భారత ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ సమన్వయంతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మ-ఎటిఎం సిబ్బంది మధుమోహన, ఏఈఓ విరూపాక్షి,ఎంపీఈఓ నరసింహులు,విఏఏ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!