
ఘనంగా మిక్కిలినేని ప్రసాద్ జన్మదిన వేడుకలు
రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువకులు
హోళగుంద, న్యూస్ వెలుగు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీబీపీ ఎల్ ఎల్ సి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ జన్మదిన వేడుకలను గురువారం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మిక్కిలినేని అభిమానులు కేక్ కట్ చేసి మిక్కిలినేని వెంకట శివప్రసాద్ జన్మదినాన్ని సంబరంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్, భారత్ యూత్ సంఘం గౌరవ అధ్యక్షులు శివ శంకర్ గౌడ్ అలేఖ్య విజయ్ కుమార్,అబ్దుల్ సుభాన్,యువ నాయకులు ముల్లా మోయిన్,దుర్గాప్రసాద్,పంచగుండిగ వెంకటేష్ శ్రీ సిద్దేశ్వర స్వామి రైస్ మిల్ మురళీధర కాడ సిద్ధప్ప నేషనల్ కౌశల్ మెంబర్ చిదానంద అధ్యక్షులు ప్రసాద్ శీను తదితరులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ హోళగుంద ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలలో నాయకులు అధికారులతో తనకున్న పరిచయాలను ఉపయోగించి మన ప్రాంతా అభివృద్ధి కోసం పనిచేస్తున్న మిక్కిలి నేని వెంకట శివప్రసాద్ సేవలు గొప్పవని పేర్కొన్నారు.సేవాతప్తరునిగా ప్రజలతో మంచి స్నేహ సంబంధాలు కలిగి అవసరంలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనసున్న మిక్కిలినేని ప్రసాద్ ప్రస్తుతం హొళగుంద ప్రాంత అభివృద్ధికి ఆశాదీపం అన్నారు.నాయకులు,కార్యకర్తలు మిక్కిలినేని ప్రసాద్ కు అండగా ఉండి మన ప్రాంతా అభివృద్ధికి అవసరమైన పనులను నిధులను సాధించుకుందామన్నారు.అలాగే మిక్కిలినేని వెంకట శివప్రసాద్ జన్మదినం సందర్భంగా యువ నాయకులు,అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని 21 మంది రక్తదానం చేశారు. యువత ప్రసాద్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అలాగే ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ వెంకట శివప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మిక్కిలినేని కూటమి నాయకులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.