
త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆదేశాల మేరుకు సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ నందు నూతన పైపు లైన్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఉపాధ్యాయక్షులు గిరి మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ కాలనిలో త్రాగునీరు ఇబ్బందిగా ఉండవల్ల మరియు వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నూతన త్రాగునీటి పైపు లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అలాగే ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!