శ్రీ చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు బహిరంగ వేలం

శ్రీ చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు బహిరంగ వేలం

గుర్ రెడ్డి, కల్లూరు కార్య నిర్వాహధికారి

కల్లూరు,న్యూస్ వెలుగు; కర్నూలు నగరం,కల్లూరులోని చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు శుక్రవారం నాల్గవ పట్టణ పోలీసుల సహకారంతో బహిరంగ వేలం నిర్వహించినట్లు దేవాదాయ శాఖ కల్లూరు కార్య నిర్వాహధికారి పేర్కొన్నారు.ఈ మేరకు వారు వివరాలు వెల్లడించారు.బహిరంగ వేలంలో దాదాపు 17మంది పాల్గొన్నారని అన్నారు.వేలంలో పాల్గొనేందుకు ప్రతి వ్యక్తి నుండి రూ. 25వేలు డిపాజిట్ గా చెల్లించాలి.ప్రతినెల అద్దెరూపంలో రూ.7వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.వేలంలో పాల్గొన్న వారిలో…జయలక్ష్మి,కె.ఈశ్వరయ్య,సాన శ్రీనివాసులు,లక్ష్మన్న,డి.కార్తీక్ రావు,సాన రమేష్,సాన సురేంద్ర,టి.సుబ్రహ్మణ్యం, మల్లికార్జున,సాన రాజ్ కుమార్, బి.శ్రీనివాసులు,శివరామ కృష్ణయ్య,పి. వెంకటరమణ,పృద్వి రాజ్ లు పాల్గొని దుకాణాలు దక్కించుకున్నట్లు పేర్కొన్నారు.

ఎస్ సిలు వేలంలో పాల్గొనరాదు.
వెంకటేశ్వర్లు,ఆలయ చైర్మన్

దుకాణాలు వేలం సందర్బంగా వేలంలో ఎస్ సిలు పాల్గొనరాదని ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు చేసిన వ్యాక్యలపై దళితులు పూర్తి స్థాయిలో అగ్రహం చెంది, వాగ్వివాదానికి దిగారు.ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకొని ఇరువురిని సర్దిచెప్పారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!