
ప్రభుత్వ కార్యక్రమాలకు కూటమి పార్టీ నాయకులను ఆహ్వానించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు :మండలంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు కూటమి పార్టీ నాయకులను అధికారులు ఆహ్వానించాలని సోమవారం కూటమి నాయకులు ప్రసాద్,పంపాపతి,ఎర్రి స్వామి,దిడ్డి వెంకటేష్,మోహిన్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు కూటమి నాయకులను ఆహ్వానించకుండా కూటమి నాయకులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.మరియు ఇక ముందైనా అధికారులు తిరు మార్చుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆహ్వానించాలని లేని యెడల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జక్కన్న ఆచారి,తిప్పన్న,జాకీర్,అంజి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!