వినతులను స్వీకరించిన కమిషనర్

వినతులను స్వీకరించిన కమిషనర్

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించండి

* నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు

* ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 వినతులు

కర్నూలు నగరపాలక సంస్థ;
కర్నూలు న్యూస్ వెలుగు :  నగరంలో పలు సమస్యలు దృష్టికి వచ్చినప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులకు సూచించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి 14 వినతుల రాగ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ప్రజారోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్‌ఓ జునైద్, ఎంఈలు సత్యనారాయణ, శేషసాయి, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన విన్నపాల్లో కొన్ని..

1. నగరపాలక పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న 200 మంది తాత్కాలిక కార్మికుల వేతనాలు 15 వేలకు పెంచాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని, పని భారం ఎక్కువగా ఉన్నందున కార్మికుల సంఖ్య 400‌కు పెంచాలని, పిఎఫ్, ఈయస్ఐ సక్రమంగా జమ చేయాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.వి. నారాయణ నేతృత్వంలో కార్మికులు వినతిపత్రం సమర్పించారు.
2. వెంకటరమణ కాలనీ 2వ లైన్‌లో పూడికతీత పనులు చేపట్టాలని, ఖాళీ స్థలంలో చెత్తాచెదారం తొలగించాలని స్థానికులు వై.రాజేంద్ర, బి.వీరేంద్ర కుమార్ విన్నవించారు.
3. బిర్లా కాంపౌండ్‌లోని విష్ణు అపార్ట్మెంట్ నందు కోతుల బెడద ఎక్కువ ఉందని స్థానికులు సి.మంజుల, ప్రకాష్ బాబు తదితరులు విన్నమించారు.
4. ల్యాండ్ మార్క్ అవెన్యూ వెంచర్ నందు పైప్‌లైన్ ఉంది గానీ, నీటి సరఫరా లేదని, సరఫరాకు చర్యలు తీసుకోవాలని స్థానికులు మధు, అశోక్, తదితరులు కోరారు.
5. 19 వార్డు మారుతి నగర్ జ్యూడిషియల్ ఎంప్లాయీస్ కాలనీలో రహదారులు, మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు హబీబున్నీసా, మహబూబ్ సాహెబ్ విన్నవించారు.
6. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ 217/1, 217/3 సర్వే భూముల్లో ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అందులో తాము ఇళ్లను సైతం నిర్మించుకుని 15 సంవత్సరాలుగా 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అయితే ఎలాంటి మౌలిక వసతులు లేవని, తమకు తాగునీటి సౌకర్యం, రహదారులు, మురుగు కాలువలు, ప్రాథమిక పాఠశాలల, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు శారద, శ్రీదేవి, మంజుల తదితరులు కోరారు.
7. విఠల్ నగర్ నందు పైపు‌లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని, కాలనీ మురుగు కాలువను ప్రధాన మురుగుకలోకి అనుసంధానం చేయాలని స్థానికులు సి. కేదార్నాథ్ విన్నవించారు.
8. లేపాక్షి నగర్ నందు మురుగు బయటకు వెళ్లేందుకు ఆస్కారం లేనందున, తమ కాలనీలోని మురుగు కాలువను ఎఫ్‌సిఐ కాలనీ 2 వరకు పొడిగించాలని స్థానికులు రామన్నాయుడు, శ్రీనివాసులు తదితరులు కోరారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS