
విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన… హాస్టల్ సిబ్బంది
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని పెండేకల్ ఆర్ ఎస్ స్టేషన్లో స్థానికంగా ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకు హాస్టల్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కమాటి మనోహర్, ఆనంద్, బాల స్వామి లు సంయుక్తంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. సుంకన్న ఆదేశాల మేరకు హాస్టల్ లోని విద్యార్థుల త్రాగు నీటి సౌకర్యం కోసం బాటిల్స్ ను అందజేశారు. ఈ సందర్బంగా మనోహర్, ఆనంద్, బాలస్వామి మాట్లాడుతూ హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు వారికి త్రాగడానికి సొంత బాటిల్స్ లేనందున ఒకరి బాటిల్స్ ఒకరు ఉపయోగించకుండా ఎవరి బాటిల్స్ వారికి ఉండే విధంగా త్రాగు నీటి బాటిల్స్ ను తీసుకువచ్చి విద్యార్థులకు అందజేయడం జరిగిందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో హాస్టల్ విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!