
ఎల్ ఎల్ సి దిగువ కాలువ పై చెత్తను తొలగించండి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం ఎల్ ఎల్ సి దిగువ కాలువ గట్టు పై పేరుకుపోయిన చెత్త చెదారంను తొలగించాలని పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్, సర్పంచ్ తనయుడు పంపాపతికి కూటమి పార్టీ నాయకుల బసవరాజు,కృష్ణయ్య,వైసీపీ మండల కన్వీనర్ షఫీయుల్లా, రామకృష్ణ,వెంకటేష్ వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల కళేబరాలు,ఈకలు చెత్త చెదారంను దిగువ కాలువ గట్టు పై వేయడంతో దుర్వాసన వెదజేల్లడంతో పాటు ప్రజలు అనారోగ్యం బారినా పడక ముందే జాగ్రత్త వహించి కాలువ గట్టును పరిశుభ్రం చేయించాలని కోరారు.మరియు కాలువ గట్టు పరిశుభ్రం కాకుండా కాలువ గట్టు పై జంతువుల కళేబరాలు,ఈకలు చెత్త చెదారం వేసే వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలన్నారు.అంతేకాకుండా తేరుబజార్ నందు కూడా చెత్త చెదారం వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!