
ఇరుముడితో మల్లన్న సన్నిధికి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రం నుంచి శివదీక్షాపరులు ఆదివారం ఇరుముడులతో శ్రీశైల మల్లన్న సన్నిధికి బయలు దేరి వెళ్ళారు.
ఆదోని రహదారిలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి స్వీకరించారు.ముందుగా స్వామి వారి ఆలయంలో శివ మాలధారుల ఆధ్వర్యంలో 4 సామూహిక వివాహాలు జరిగాయి.ఈ సందర్భంగా మాలధారుల కుటుంబ సభ్యులు,భక్తులు,బంధుమిత్రులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసింది. అనంతరం మాలధారులను కుటుంబ సభ్యులు ఊరేగింపుగా సాగనంపారు.
Was this helpful?
Thanks for your feedback!