
వైభవంగా నేరణికి లింగేశ్వర స్వామి పట్టా దేవర ఉత్సవం
భక్త జనంతో కిక్కిరిసిన ముద్దటమాగి గ్రామం.
ఆకట్టుకున్న వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.
ఉత్సవాల్లో ఒక్కటైన 50 జంటలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ముద్దటమాగి గ్రామంలో ఆదివారం శ్రీ నేరణికి లింగేశ్వర స్వామి పట్టా దేవర ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి.ప్రధానంగా శ్రీ నేరణికి లింగేశ్వర స్వామి ద్వితీయ పట్టాభిషేకం దేవర ఉత్సవాల్లో భాగంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఉత్సవ విగ్రహ మూర్తుల ఊరేగింపు బీరప్ప స్వామి డొళ్ళులతో ముద్దటమాగి గ్రామం మారుమోగింది.దేవర కార్యక్రమం సందర్భంగా భక్తులతో గ్రామం కిక్కిరిసింది.అలాగే దేవర ఉత్సవాల సందర్భంగా 50 సామూహిక వివాహాలు జరిగాయి.అంతేకాకుండా ప్రజలందరీ సహకారంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
Was this helpful?
Thanks for your feedback!