
ప్రజల ఆశ ఆకాంక్షల మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది
కడ్లేమాగి బి టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.
ఇంచార్జీ వీరభద్ర గౌడ,డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం కడ్లేమాగి గ్రామానికి రూ.3.60 లక్షలతో నిర్మిస్తున్న బి టి రోడ్డు నిర్మాణానికి ఆలూరు
టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ,డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ చేతుల మీదుగా భూమి చేసి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ,డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పల్లెలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ పల్లెల రూపురేఖలు మార్చిందని చెప్పారు.అలాగే ఎన్నికల సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన తమ ప్రభుత్వం అదరకుండ గట్టిగా నిలబడిందని అంతేకాకుండా ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్నారు.అదేవిధంగా ఎస్సి హాస్టల్ పునః ప్రారంభించాలని ఏంఆర్పిఎస్ నాయకులు వినంతి పత్రం సమర్పించారు.మరియు ప్రజల ఆశ ఆకాంక్షల మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ లలిత,పిఆర్ఏఈ యమునప్ప,ఈఓపీఆర్డి చక్రవర్తి,మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ,బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,మాజీ మండల అధ్యక్షులు ప్రసాద్,జనసేన మండల కన్వీనర్ అశోక్,కూటమి పార్టీ నాయకులు అబ్దుల్ శుభాన్,భాష,మోహిన్,వీరెష్ కాంట్రాక్టర్ బిఎన్ ఆర్ రఘురామిరెడ్డితదితరులు పాల్గొన్నారు.