
టీడీపీ ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్ పెంచడం హర్షించదగ్గ విషయం
కర్నూలు, న్యూస్ వెలుగు; శారీరక దివ్యంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం (రిజిస్ట్రేషన్ నెంబర్ 299 ఆఫ్ 2024) స్టేట్ ప్రెసిడెంట్ ఎల్లయ్య ఆధ్వర్యంలో టీచర్స్ ట్రాన్స్ఫర్ ఆక్ట్ 2025 కు సంబంధించి సవరించే విషయమై దివ్యంగ ఉపాధ్యాయులకు 40 శాతం వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రిఫరెన్షియల్ కేటగిరిలో చేర్చే అంశానికి సంబంధించి అలాగే వైకల్యం 70% పైబడిన వైకల్యం కలిగిన దివ్యాంగ ఉపాధ్యాయులందరినీ సాధారణ బదిలీల నుంచి మినహాయించడం. వారు కావాలని కోరుకుంటే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం గురించి దాదాపుగా గత నాలుగు నెలల నుంచి శారీరక దివ్యంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున విద్యాశాఖకు సంబంధించిన కమీషనర్ గారికి, డైరెక్టర్ గాకి, ప్రిన్సిపాల్ సెక్రటరీ కి, విద్యాశాఖ మంత్రి కి
వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కమిషనర్ , వికలాంగుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మంత్రి కి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అయినా బాల వీరాంజనేయులు కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మన సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగానే మార్చి 4 ఐదో తారీకులలో మరొకసారి శారీరక దివ్యంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజుకి వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ డైరెక్టర్ ,తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు వెళ్లి అక్కడ విద్యాశాఖ మంత్రి సెక్షన్ నందు 4 వ తేదీ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఐదో తారీఖున అంకిరెడ్డి అశ్వర్థ నారాయణ రెడ్డి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ Act 2025లో దివ్యాంగ ఉపాధ్యాయులు చేయవలసిన సవరణలు గురించి రిప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది.
చర్చించిన అంశాలు:….
1)2016 దివ్యాంగుల చట్ట ప్రకారం 40% వైకల్యం కలిగిన దివ్యాంగ ఉపాధ్యాయులను ప్రిఫరెంషియల్ కేటగిరిలో చేర్చాలి.
2)2017 సంవత్సరంలో మన ప్రభుత్వం TDP దివ్యాంగులందరికీ 40% వైకల్య శాతం ఉన్నవారందరినీ ప్రిఫరెన్షియల్లో చేర్చి బదిలీలు చేయడం జరిగింది.
3)అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా 40% వైకల్యాన్ని బెంచ్ మార్క్ ని ప్రాధాన్యతగా తీసుకోవడం జరుగుతా ఉన్నది.
4) విద్యా శాఖలో 2022 తర్వాత పర్సంటేజ్ గా డివైడ్ చేయడం వల్ల 40% to 50%=5 points
51% to 69%=10 points
Above 70% Preparencial category గా విభజించడం వలన దివ్యాంగ ఉపాధ్యాయులు ఫ్యామిలీలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇది దివ్యాంగుల చట్టానికి పూర్తి విరుద్ధం అని చెప్పడం జరిగింది.
5) 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం బెంచ్ మార్క్ డిజేబులిటీ 40% కలిగివున్న దివ్యాంగులందర్నీ ప్రిఫరెన్షియల్ కేటగిరిలో చేర్చడం వలన ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి భారం కూడా పడదు.
6) దివ్యాంగ ఉపాధ్యాయులు ఒకసారి పెర్మనెంట్ అని ఉన్న సదరం సర్టిఫికెట్ పొందిన అదే దానిని ఎస్సార్ లో ఎంట్రీ చేసిన తర్వాత మరల ప్రతి ట్రాన్స్ఫర్స్ లోనూ కొత్త సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
7) వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ కూడా విద్యాశాఖ కమిషనర్ కి విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కి దివ్యాంగ ఉపాధ్యాయుల నలభై శాతం వైకల్యం కలిగి ఉన్న వారందరినీ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో చేర్చే అంశానికి సంబంధించి కూడా లెటర్ పంపించడం జరిగింది
8) విద్యాశాఖ కమిషనర్ చర్చలు ఎప్పుడు జరిపిన కేవలం నార్మల్ సంఘాలను మాత్రమే పిలిచి చర్చలు జరపడం వారికి అనుకూలంగానే నిర్ణయాలు చేస్తున్నారు. వికలాంగుల సమస్యలు వికలాంగులకే తెలుస్తాయి కాబట్టి వికలాంగుల సంఘాలతో కూడా చర్చలు జరపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చట్టంలో లేని వారికి పాయింట్స్ నందు అవకాశం కల్పించడం విడోస్ కానీ ఒంటరి మహిళలకు పాయింట్స్ కేటాయించాలని కానీ ఏ చట్టము చెప్పదు. ప్రిఫరెన్షియల్ క్యాటగిరిలో వ్యాధిగ్రస్తులను ఏ ప్రాతిపదికన చేర్చారు అర్థం కాని పరిస్థితి.
చట్టంలో ఉన్న దివ్యాంగులను ఉపాధ్యాయులను మాత్రం వదిలేసి చట్టంలో లేనటువంటి వారికి ప్రాధాన్యత కల్పించడం అనేది దివ్యాంగులందరికీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది.
ఇది వికలాంగుల చట్టానికి 2016 ఆర్పిడబ్ల్యుడి ఆక్ట్ కు పూర్తి విరుద్ధంగా ఉన్నది.
తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్ పెంచడం చాలా హర్షించదగ్గ విషయం అలాగే దివ్యాంగ ఉపాధ్యాయుల న్యాయపరమైన చట్టంలో ఉన్న అంశాలను ఇప్పటికైనా పరిశీలించి 40 శాతం వైకల్యం కలిగిన ప్రతి దివ్యాంగ ఉపాధ్యాయులను preferential కేటగిరీలో చేర్చి 70 శాతం పైబడిన వారిని సాధారణ బదిలీల నుంచి మినహాయించాలని ఒకవేళ వారు కోరుకుంటే మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలని కోరడం జరిగింది.
ఉపాధ్యాయుల బదిలీల చట్టం 2025ను తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని దివ్యాంగులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాలను దివ్యాంగులకు న్యాయమైన 2016 చట్టంలో ఉన్న అంశాలను 40 శాతం వైకల్యం కలిగి ఉన్న దివ్యంగులందరినీ ప్రిఫరెన్షియల్ కేటగిరిలో చేర్చేటట్లుగా కృషి చేస్తారని విద్యా శాఖ కమిషనర్ కి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి, గౌరవనీయులైనటువంటి విద్యా శాఖ మంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎంని శారీరక దివ్యంగా ఉద్యోగుల సంక్షేమ సంఘం రిక్వెస్ట్ చేస్తున్నది.
కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు , రాష్ట్ర ట్రెజరర్ శివ నాగేంద్ర , రమేష్ ,దుర్గారావు , సాంబయ్య తదితర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాలరాజు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ , అంకిరెడ్డి ,వరదారెడ్డి , శ్రీనివాసులు , తాతారావు , సన్యాసిరావు , ప్రసాద్ ,పెద్దన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.