
త్రాగునీటి పై ప్రత్యేక నిఘా వహించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి జివి రమణ రెడ్డి మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని మండలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక నిఘా వహించాలని సూచించారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సర్వేను వంద శాతం పూర్తి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలలిత,ఈఓపిఆర్డి చక్రవర్తి,సూపర్వైజర్ శిబారాణి,పంచాయితీ కార్యదర్శులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda