
12న విద్యార్థులు, నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఈ నెల 12వ తేదీన విద్యార్థులు, నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటకు పిలుపునిచ్చింది పేద విద్యార్దులకు చదువులకు ఇబ్బందులు లేకుండా ఫిజురీబర్సమెంట్ ను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. చంద్రబాబు హయాంలో ఫిజురీబర్సమెంట్ ను నిర్వీర్యం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో పేద విద్యార్థులకు విద్యా దివెన, వసతి దివెన, అమ్మ ఒడి ప్రవేశపెట్టారు.కూటమి ప్రభుత్వ బడ్జెట్ లో విద్యా దివెన, బైజుస్, ఫిజురీబర్సమెంట్ ఊసే లేదు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒక్క పేజీ లో తెలుగు, మరో పేజిలో ఇంగ్లీష్ ను తీసుకొచ్చారు.
భవిష్యత్ ఆలోచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్యాబ్లలను తీసుకొచ్చారు.
ట్యాబులపై కూటమి నేతలు విషప్రచారం చేశారు. టిడిపి మహిళ ఎమ్మెల్యే ప్రస్తావించడం చాలా దారుణం
విద్యా దివెన, మధ్యాహ్నం భోజనం లో లోపాలు, మెను లేకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతుంది
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జగనన్న గొరుముద్దా పేరుతో మెను ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేశారు.నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి లేదు, 20 లక్షల ఉద్యోగాలు కల్పోస్తామని చెప్పి మోసం చేశారు.
వాలంటీర్లు ను తొలగించి 2 లక్షల ఉద్యుగాలు తొలగించారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు నారా లోకేష్… ఉద్యోగాలు కల్పించకపోతే చోక్కా పట్టుకొమని నారా లోకేష్ ఉప్పుడు ఏమి చేస్తున్నారు .తల్లికి వందనం 15 వేలు అందిస్తామని ఇప్పటికీ వాటిపై స్పష్టత లేదు. తల్లికి వందనం వస్తుందని విద్యార్దుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
సూపర్ సిక్స్ హామిలను అమలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 12 వ తేదీన నిరసన ర్యాలీ చేపట్టుతుంది.అసెంబ్లీలో ప్రశ్నించేవారు లేరని విచ్చలవిడిగా అపబ్దాలను కూటమి ప్రభుత్వం చెబుతుంది.కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న ప్రజలకు ఏమి చేయడం లేదు. ఈ బడ్జెట్ లో విద్యా, వైద్య, నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము.
ఉచిత బస్సు ప్రయాణం పేరుతో జిల్లా కు పరిమితం చేస్తామని మహిళలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మహిళలు విజయవాడ, అమరావతి, విశాఖ పట్నం చూడాలన్న మహిళలకు కూటమి ప్రభుత్వం మోండి చేయి చూపిస్తుంది.
ప్రజల తరపున పోరాటానికి తాము ఎప్పుడు సిద్దంగా ఉన్నామని , విద్యార్ది ,యువతకు మద్దత్తుగా యువత పోరుకు అందరు సహకరించాలని పిలుపునిచ్చిన ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు.