పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లో నేరాల నమోదు,ఛార్జ్ షీట్ వంటి పలు రికార్డులను పరిశీలించారు.అనంతరం మర్లమాడికి ఉన్న చెక్ పోస్టును కూడా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు పట్ల,ప్రమాదాల నియంత్రణకు ప్రజలు అవగాహన కల్పించాలని ఎస్ఐ బాల నరసింహులుకు సూచించారు.అంతేకాకుండా పోలీసులు ప్రజలకు మరింత చెరువైయ్యేలా విధులు నిర్వహించాలని తెలియజేశారు.నిరుపయోగంగా ఉన్న పాత పోలీస్ స్టేషన్ ఉపయోగకరంగా మార్చాలని ప్రజలు జిల్లా ఎస్పీని కోరారు.ఇందుకు సానుకూలంగా స్పందించి ఎస్పీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆలూరు సీఐ వెంకట చలపతి,ఎస్ఐ బాల నరసింహులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!