శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల వివరాలు

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల వివరాలు

న్యూస్ వెలుగు, శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది పండగను పురస్కరించుకొని ఆలయ అధికారులు సేవ కార్యక్రమాలు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఉగాది మహోత్సవాలను పాల్గుణ బహుళ త్రమోదశి తేది 27 ఫిబ్రవరి ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభించి, చైత్ర శుద్ధ విదియ తేది 31 సోమవారం రోజున, ఉ,గం.10.00లకు పూర్ణాహుతి చేసిన అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ ఉత్సవము, ఇతర కార్యక్రమాలతో ముగింపు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఫబ్రవరి 17నుంచి 26 వరకు శ్రీస్వామి వారి దర్శనాలు , స్పర్శ దర్శనం 500 రూ. స్పర్శ దర్శనం అలంకార దర్శనం రూ.1500 అందుబాటులో ఉంటాయని భక్తులకు తెలిపారు. ప్రత్యేకంగా 27 నుంచి 31 వరకు అన్ని వేళలో అలంకార దర్శనం భక్తులకు ఉంటుందని అధికారులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!