సిఎం కార్యాలయం నుండి వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకూడదు

సిఎం కార్యాలయం నుండి వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకూడదు

రెవెన్యూ సదస్సుల అర్జీల పరిష్కారం పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు; సిఎం కార్యాలయం నుండి వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, పెండింగ్ లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు..
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు..
ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.. పత్తికొండ ఆర్డీఓకు సంబంధించి 10, సబ్ కలెక్టర్ ఆదోని కి సంబంధించి 16, కర్నూలు ఆర్డీఓకు సంబంధించి 15, డిఎస్ఓకు సంబంధించి 3, ఎడి సర్వే కు సంబంధించి 2, డీఆర్డిఎ పిడి కు సంబంధించి 2, జిల్లా పరిషత్ సీఈఓ, డిఎంహెచ్ఓ, డి పి ఓ, గిరిజన సంక్షేమ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్,, జిల్లా రిజిస్ట్రార్, హౌసింగ్ పిడి లకు సంబంధించి ఒక్కొక్క దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వీటిని పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..రెవెన్యూ శాఖ లో ఎక్కువగా పెండింగ్ ఉన్నాయని, పరిష్కారంపై శ్రద్ధ చూపాలని, జాప్యం చేయకూడదని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవో లను ఆదేశించారు..ఈ అంశంపై సంబంధిత అధికారులతో మాట్లాడి, వేగంగా పరిష్కరించే విధంగా దృష్టి సారించాలని కలెక్టర్ డిఆర్ఓ ను ఆదేశించారు…
రెవెన్యూ సదస్సుల అర్జీల పరిష్కారం పూర్తి కావాలని కలెక్టర్ తహసీల్దార్ లను ఆదేశించారు..రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలకు సంబంధించి కృష్ణగిరి తహసిల్దార్ వద్ద 43, కర్నూలు ఆర్డీఓ వద్ద 37, పత్తికొండ ఆర్డిఓ వద్ద 12, మద్దికెర తహసిల్దార్ వద్ద 11, ఓర్వకల్లు తహసిల్దార్ వద్ద 9 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, అలాగే మిగిలిన మండలాల్లో కూడా సింగిల్ డిజిట్ లో పెండింగ్ ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు…

సచివాలయాల ద్వారా నిర్వహించే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

సచివాలయాల ద్వారా నిర్వహించే పనులను పెండింగ్ లేకుండా వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ లను ఆదేశించారు..మండల స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లి, ఆధార్ వెరిఫికేషన్ తదితర కార్యక్రమాలకు సంబంధించి ఆయా మండలాల్లో, సెక్రటేరియట్ వారీగా పెండింగ్ లో ఉన్న వివరాలపై సమీక్షించి సాయంత్రం లోపు నివేదిక అందచేయాలని ఇవ్వాలని కలెక్టర్ మండల స్పెషల్ ఆఫీసర్ లను ఆదేశించారు… ఆధార్ వెరిఫికేషన్ కు సంబంధించి 3 వేల 700 పెండింగ్ లో ఉన్నాయని, ఏ సెక్రటేరియట్ నుండి పెండింగ్ ఉన్నాయో చూసి, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, తుగ్గలి, సి. బెళగల్, హోళగుంద మండలాలు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు.. ఈ అంశాలపై 90 రోజుల నుండి సమీక్ష నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ కొన్ని మండలాలు వెనుకబడి ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు..సచివాలయం వారీగా సమీక్షించి, మూడు నెలల్లో పురోగతి చూపకపోతే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మండల స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు… మండల స్పెషల్ ఆఫీసర్ లు తరచు మండలాలకు వెళ్లి, సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ సీఈవో, డీపీఓ కూడా ఈ అంశంపై సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు..
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బికె.వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!