
రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన పెద్దహ్యట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను చిన్నహ్యాట
గ్రామ సచివాలయం నందు మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిశీలించారు.అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రీ సర్వేకు సంబంధించిన అంశాల పై అధికారులతో చర్చించారు.తదనంతరం నేరణికి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్న చికెన్ బంకులను పరిశీలించారు.అలాగే లింగంపల్లి గ్రామానికి వెళ్లి పొలం రహదారి సమస్య,పొలం తగాద విషయం పై విచారణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్,రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ముకుంద రావు,ఈఓపీఆర్డి చక్రవర్తి,డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య,మండల సర్వేయర్ శ్రీనివాస నాయక్,విఆర్ఓలు దామోద,ప్రహ్లాద,లక్ష్మీనారాయణ రెడ్డి,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!