
మూడు దశాబ్దాల కల షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
ఎస్ వెంకటేశ్వర్లు మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటినుండి షెడ్యూల్డ్ కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడంతో మాదిగ మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిందిని ఎస్ వెంకటేశ్వర్లు తెలియజేశారు ఈ సమావేశంలో మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలకు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ లేకపోవడంతో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబాటుతనానికి గురికావడం జరిగింది. ఈ అంశాన్ని గమనించి 1994 జులై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పాటు కావడం జరిగింది ఈ యొక్క ఉద్యమం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తాకి 1997లో హైదరాబాదు నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ కులాలను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని డిమాండ్ చేయడం జరిగింది. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నేటి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవ నారా చంద్రబాబునాయుడు గారు స్పందించి1998లోనే రామచంద్ర రాజు కమిషన్ నియమించి 2000 నుండి 2004 వరకు వర్గీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అదే సమయంలో నేడు మరల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర యూనిట్ గా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో డిమాండ్ చేయగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారు ఏక సభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎస్ వెంకటేశ్వర్లు మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోకన్వీనర్