
దేవస్థానం భూములను స్వాధీనం చేసుకోండి: సీపీఐ రంగనాయుడు
న్యూస్ వెలుగు నంద్యాల : బేతంచెర్ల పట్టణం మండలలోని దేవస్థానం భూములను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా దేవాదాయ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణం మరియు మండలం లోని గ్రామాలలో వున్నా ఆంజనేయస్వామి, చెన్నకేశవ స్వామి, మాధవ స్వామి, గట్టు నరసింహస్వామి ఆలయాలకు చెందిన సుమారు 200 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నాయకులు తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి దేవస్థాన భూములను కబ్జా చేసి దేవస్థానాలకు వచ్చే ఆదాయమును సైతం గండి కొట్టి అనుభవిస్తున్నారన్నారని ఆరోపించారు. ఇల్లు లేని నిరుపేదలు రెండు సెంట్ల ఇంటి స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించుకుంటే వాటినిస్వాధీనం చేసుకునే అధికారులు ఇంత పెద్ద ఎత్తున దేవస్థానం భూములు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమణకు గురైన భూములు ప్రస్తుత బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్ల రూపాయలు విలువ ఉంటుందని అన్నారు. 175, 235, 293, 306, 334, 338, 393, 543, 545, 640, 646, 674, 780, 772, 778, 903, 911, 1004, 1183, 612, 810 దేవస్థానాల భూముల సర్వే నెంబర్ లపై పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ జరిపించి దేవుని మాన్యం భూములను ఆక్రమాల నుండి కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ కోరింది. లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలను కలుపుకొని ఆ భూములను గుర్తించి స్వాధీనం చేసుకొని దేవాదాయ శాఖకు అప్పగిస్తామని వారి సందర్భంగా హెచ్చరించారు.