
నూతన వంగడాలను విడుదల చేసిన ప్రధాని మోది
న్యూఢిల్లీ: భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల, జీవశక్తితో కూడిన 109 రకాల పంటలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేశారు. 109 రకాల 61 పంటలలో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రైతులు, శాస్తవేత్తలతో సంభాషించారు. ఈ కొత్త పంట రకాల ప్రాముఖ్యతను చర్చిస్తూ, వ్యవసాయంలో ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. ఈ కొత్త రకాలు తమ వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని రైతులు తెలిపారు. మిల్లెట్ యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రధాన మంత్రి చర్చించారు. ప్రజలు పౌష్టికాహారం వైపు ఎలా పయనిస్తున్నారనే విషయాన్ని కూడ ధృస్టీ లో ఉంచికోవాలని ఆయన సూచించారు. సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు సేంద్రియ వ్యవసాయం పట్ల సామాన్యులకు పెరుగుతున్న విశ్వాసం గురించి కూడా ఆయన శాస్తవేత్తలతో మాట్లాడారు. ప్రజలు సేంద్రీయ ఆహారాన్ని తీసుకోవడం మరియు డిమాండ్ చేయడం ప్రారంభించారని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులు అభినందించారు. అవగాహన కల్పించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) నిర్వహిస్తున్న పాత్రను కూడా రైతులు కొనియాడారు. KVK లు రైతులకు వాటి ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి నెలా అభివృద్ధి చేస్తున్న కొత్త రకాల ప్రయోజనాల గురించి రైతులకు ముందుగానే తెలియజేయాలని ప్రధాన మంత్రి సూచించారు.
ఈ కొత్త పంట రకాలను అభివృద్ధి చేసినందుకు శాస్త్రవేత్తలను మోదీ ప్రశంసించారు. నిరుపయోగంగా ఉన్న పంటలను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రధాని చేసిన సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.