గోల్డమైన్ పనులను పరిశీలించిన సౌత్ ఆఫ్రికా నిపుణుల బృందం

గోల్డమైన్ పనులను పరిశీలించిన సౌత్ ఆఫ్రికా నిపుణుల బృందం

పత్తికొండ న్యూస్ వెలుగు : పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జొన్నగిరి పరిసర ప్రాంతాలలో జియోమైసూర్ కంపెనీ వారు నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్ ను సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన మైనింగ్ నిపుణుల చేత సర్వే మరియు కంపెనీ అధికారులతో చర్చ నిర్వహించడం జరిగిందని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి క్రాంతి నాయుడు  తెలిపారు . మైనింగ్ కంపెనీ వారి దృష్టికి ప్రజల పలు సమస్యలు తీసుకువెళ్లడం జరిగిందని , వారితో సిఏస్ఆర్ పనులు, పర్యావరణ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, లాండ్ లీజు, స్కిల్ డెవలప్మెంట్ తదుపరి అంశాల పైన దీర్ఘమైన చర్చ నిర్వహించడం జరిగిందన్నారు . కంపెనీ వారికి రెండు నెలలు గడువు ఇచ్చి తెలిపిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని , లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని లీగల్ గా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రాంతి నాయుడు వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా మైనింగ్ కంపెనీ నిపుణులు రమేష్, స్థానిక నాయకులు రామకృష్ణ, జగన్, వెంకటేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!