
ఎస్ఐను కలిసిన మిక్కిలినేని శ్రీనివాస్
హోళగుంద, న్యూస్ వెలుగు :మండల కేంద్రంలో మంగళవారం పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా భాద్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు మిక్కిలినేని శ్రీనివాస్,దుర్గా ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువ పూలమాలలతో సత్కరించారు.
ముగిసిన వేలాలు.
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ ఆదాయ పద్దులైన వారపు సంత మార్కెట్,బస్టాండ్,సృజల స్రవంతి(వాటర్ ప్లాంట్),కామేళల బహిరంగ వేలాలు మంగళవారం సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్ హాజరయ్యారు.ఇందులో వారపు సంత మార్కెట్ ను ఎం.ఈశ్వరప్ప రూ.1,90,000/-,బస్టాండ్ ను వెంకటగిరి రూ.2,10,000/-,సృజల స్రవంతి(వాటర్ ప్లాంట్) చిన్న పంపాపతి రూ.55000/-,కామేళను యడవళ్లి మల్లికార్జున రూ.71,500/- అతి హెచ్చు పాట పాడి దక్కించుకున్నారు.ఈ సందర్భంగా డిఎల్పిఓ నూర్జహాన్ మాట్లాడుతూ వేలం పాటలో పాటదారులు దక్కించుకున్న మొత్తాన్ని వారం రోజుల లోపు గ్రామ పంచాయితీకి చెల్లించాలని,అలా కాకుండా పాడిన మొత్తాన్ని చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే వేలం రద్దు చేసి చెల్లించిన డిపాజిట్ నగదును కూడా తిరిగి ఇవ్వబడదని తెలియజేశారు.అలాగే మార్కెట్ నందు సీసీ తదితర సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు డిఎల్పిఓను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ లలిత,ఈఓపీఅర్డి చక్రవర్తి,వార్డు సభ్యులు చిన్న మల్లయ్య,సుభాన్,సర్పంచ్ తనయుడు పంపాపతి,పోలీస్ సిబ్బంది,వేలం పాటదారులు తదితరులు పాల్గొన్నారు.