
నమాజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్
విజయవాడ న్యూస్ వెలుగు :
విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైయస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!