
ఈ నెల 28వ తేదీన ‘మీ సమస్య – మా పరిష్కారం’ కార్యక్రమం
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కొత్త కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూలు న్యూస్ వెలుగు; కర్నూలు నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 28వ తేదీన ‘మీ సమస్య – మా పరిష్కారం’ అనే కార్యక్రమాన్ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నారు. కర్నూలు నియోజకవర్గానికి చెందిన ప్రజలందరూ ‘మీ సమస్య – మా పరిష్కారం’ కార్యక్రమానికి వచ్చి సమస్యలు తెలియజేయవచ్చని మంత్రి టీజీ భరత్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి కార్యాలయంలోని శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. కావున కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపారు.